టిఎస్ లాసెట్‌, పిజిఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టిఎస్ లాసెట్‌, పిజిఎల్‌సెట్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ జీబిరెడ్డిని ఉన్నత విద్యా మండలి నియమించింది. ఎంట్రెన్స్ ప‌రీక్ష‌లు రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 24 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జులై 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. జులై 20 నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లను వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టులో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.