తెలంగాణలో కొత్త‌గా 761 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్ కొనసాగుతూ ఆందోళన కలిగిస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్ర‌వారం ఉద‌యం  విడుదల చేసిన  కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతిచెందారు. 702 మంది రికవరీ అయ్యారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కు చేరుకోగా, రికవరీ కేసులు 2,55,378కు పెరిగాయి. ఇప్పటి వరకు కరోనాబారిన పడి 1448 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా మరణాల శాతం 1.5 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 0.54కు పడిపోయింది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.6 శాతంగా ఉంటే.. తెలంగాణ మాత్రం 95.40 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,839,హోం ఐసోలేషన్‌లో 8,651 మంది ఉన్నారు. ఇక, గురువారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 42,242 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 53,32,150కు పెరిగిందని ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.