తెలంగాణ‌కు కేజ్రీవాల్‌ రూ. 15 కోట్ల విరాళం

నాగార్జున రూ.50 ల‌క్షల విరాళం

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య కురిసిన భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అయిన విష‌యం తెలిసిందే.. అయితే ఈ వ‌ర‌ద బాధితుల కోసం ప‌లు రాష్ట్రప్ర‌భ‌త్వాలు, ప‌లు సంస్థ‌లు, సినీ ప్ర‌ముఖులు అండ‌గా నిలుస్తున్నారు. తాజాగా వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో ముంపు బాధితుల స‌హాయార్థం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 

(త‌ప్ప‌క‌చ‌ద‌వండిః తెలంగాణ‌కు త‌మిళ‌ స‌ర్కార్‌ రూ.10 కోట్ల విరాళం)

సీఎం రిలీఫ్ ఫండ్‌కు నాగార్జున రూ.50 ల‌క్షల విరాళం

అలాగా టాలీవుడ్ న‌టుడు నాగార్జున రూ. 50 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లో ముంపు బాధితుల‌కోసం తెలంగాణ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేయ‌డం హ‌ర్ష‌ణీయం. ఈ విప‌త్తు వ‌ల‌న నిరాశ్ర‌యులైన వారికి నా వంతు సాయంగా రూ. 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను అని నాగార్జున పేర్కొన్నారు. అలాగే ముంపు బాధితుల స‌హాయార్థం మేఘా ఇం జినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ సీఎం సహాయ నిధికి 10 కోట్ల విరాళం ప్రకటించింది. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ రెండు నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.