బ‌స్సు టిక్కెట్ ధ‌ర రూ. 15 ల‌క్షలు!

న్యూఢిల్లీ : నిజ‌మే మీరు చ‌దువుతున్న‌ది!.. బ‌స్సు టిక్కెట్ ఖ‌రీదు అక్ష‌రాలా రూ. 15 ల‌క్ష‌లు! ఆశ్చ‌ర్య‌పోకండి! ఇది నిజం. విషయమేమిటంటే.. ఈ బ‌స్సు హైద‌రాబాద్ నుండి అమ‌లాపురం కాదు ఏకంగా న్యూఢిల్లీ నుండి బ్రిటన్‌ రాజధాని లండన్‌కు ప్రయాణిస్తోంది. దీని కేవ‌లం 20 మంది ప్రయాణికులకు మాత్రమే.. ఇద్ద‌రు డ్రైవర్లు, ఒక గైడ్‌, హెల్ప‌రు ఉంటారు. ప్రయాణికుల వీసా, భోజన, వసతి సదుపాయాలు మొత్తం ఈ ట్రావెల్స్ వారే క‌ల్పిస్తారు. అందుకే టికెట్‌ ధరను రూ. 15 లక్షలుగా నిర్ణయించింది.
మొత్తం 18 దేశాల మీదుగా 70 రోజులపాటు మొత్తం 20 వేల కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణించనుంది. మయన్మార్‌, థారులాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఫ్రాన్స్‌ దేశాల మీదుగా ప్రయాణం సాగనుంది. ‘బస్‌ టు లండన్‌’ పేరుతో గుర్‌గ్రామ్‌కు చెందిన అడ్వెంచర్స్‌ ఓవర్‌ ల్యాండ్‌ అనే ట్రావెల్‌ సంస్థ ఈ బస్సును నడుపుతోంది. అయితే ఈ ఏడాది మే 21న ప్రయాణం ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది.

 

Leave A Reply

Your email address will not be published.