ఎపిలో కొత్తగా 758 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 35,196 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 758 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనాతో 7201 మంది మృతిచెందారు. తాజాగా 231 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 895879కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య 885209కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3469 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.