పంచాయతి `పోరు`: జిల్లా.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల వివరాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
మొదటి విడత జిల్లా, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు
1). శ్రీకాకుళం
శ్రీకాకుళం (రెవెన్యూ డివిజన్)
మండలాలు : ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి
టెక్కలి (రెవెన్యూ డివిజన్)
మండలాలు : జలుమూరు
పాలకొండ(రెవెన్యూడివిజన్)
మండలాలు : సరవకోట
2). విశాఖపట్నం
విశాఖపట్నం : రెవెన్యూ డివిజన్
మండలాలు : భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ
3). తూర్పు గోదావరి జిల్లా
అమలాపురం డివిజన్లో
మండలాలు: అయినవిల్లి, ఆళ్లవారం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మలికిపురం, మామిడికుదరు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం.
4). పశ్చిమ గోదావరి జిల్లా
ఏలూరు డివిజన్
5). కృష్ణా జిల్లా
నూజివీడు డివిజన్
6). గుంటూరు జిల్లా
గుంటూరు డివిజన్
7). నెల్లూరు జిల్లా
నెల్లూరు డివిజన్
8). కర్నూలు జిల్లా:
ఆదోని రెవెన్యూ డివిజన్
9). అనంతపురం జిల్లా
పెనుకొండ రెవెన్యూ డివిజన్
10). వైఎస్ఆర్ జిల్లా
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్కు, కడప డివిజన్లో చక్రాయపేట, యర్రగుంట్ల
11). చిత్తూరు జిల్లా
తిరుపతి రెవెన్యూ డివిజన్
పైన పేర్కొన్న ఈ జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లలో మొదటి విడత పంచాయతి ఎన్నికలు జరుగనున్నాయి.