ఎల్లుండి ఎమ్మెల్సీలుగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, వాణీదేవి ప్ర‌మాణం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, సురభి వాణీదేవి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 26న ఉదయం 08.30 గంటలకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించనున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం నిరాడంబ‌రంగా జ‌ర‌గ‌నుంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుర‌భి వాణీదేవి.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి గెలవగా వాణీదేవి మొదటిసారి గెలిచారు.

Leave A Reply

Your email address will not be published.