ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆఫీసుకెళ్లిన బెంగాల్ సిఎం

కోల్కతా: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించారు. కోల్కతాలో ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్పై పిలియన్ రైడ్ చేస్తూ ఆఫీసుకు వెళ్లారు. ఈ దృశ్యాలను స్థానిక ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మరోవైపు ఈరోజు బెంగాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.91కి అమ్ముతున్నారు. ముంబైలో రూ.97కు అమ్ముతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్పీజీ, డీజిల్ ధరలను రోజూ పెంచుతోందని, ఇది ఆందోళన కలిగిస్తున్నట్లు మమతా ఆరోపించారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee travels on an electric scooter in Kolkata as a mark of protest against rising fuel prices. pic.twitter.com/q1bBM9Dtua
— ANI (@ANI) February 25, 2021