ఒకే పాఠ‌శాల‌లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

ముంబ‌యి: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది కొన‌సాగుతోంది. వ‌షిమ్‌ జిల్లాలోని ఓ పాఠ‌శాల వ‌స‌తిగృహంలో ఏకంగా 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. దీంతో పాఠ‌శాల ప‌రిస‌రాల‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. వీరిలో అమ‌రావ‌తి, య‌వ‌త్మ‌ల్ జిల్లాల‌కు చెందిన విద్యార్తులే ఉండ‌టం గ‌మ‌నార్హం.

గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 8,807 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80 మర­ణాలు నమో­ద­య్యాయి. మహా­రా­ష్ట్రలో కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,21,119కు, మర­ణాల సంఖ్య 51,937కు చేరింది. మరో­వైపు గత 24 గంటల్లో 2,772 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.