తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం క‌రోనా బులిటెన్‌ ను విడుదల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,67,901కి పెరిగింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో వైరస్‌ బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1,30,105 పరీక్షలు నిర్వ‌హించారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 898 కేలుసు న‌మోద‌య్యాయి. అలాగే మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.