తెలంగాణలో కొత్త‌గా 431 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 431 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 3,04,298 కి చేరింది. వీటిలో 2,99,270 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,352 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా క‌రోనాతో ఇద్దరు మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,676 కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్‌య 97,89,113కి చేరింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.