నేడు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు (శుక్రవారం ఉదయం 11 గంటలకు) సచివాలయంలో ఎపి మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. నివర్ తుపాను ప్రభావం మీద కూడా చర్చించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.