ప‌తంగి టోల్ వ‌ద్ద 25 కిలోల బంగారం ప‌ట్టివేత‌

ప‌తంగి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారుల స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల విలువ దాదాపు రూ. 11.63 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా కారు ఎయిర్‌ బ్యాగులో బంగారం తరలిస్తుండగా అధికారులు చాకచక్యంగా గుర్తించి పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌ తరలించారు. నిందితులు హైదరాబాద్‌లోని పలు దుకాణాలకు బంగారం చేరవేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అస్సాం రాజధాని గువాహటి నుంచి కొంతకాలంగా వీరు నగరానికి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కారును సీజ్ చేసి బంగారం త‌ర‌లిస్తున్న ముగ్గురు నిందితుల‌ను హైద‌రాబాద్‌లోని డిఆర్ ఐ కార్యాల‌యానికి త‌ర‌లించి విచార‌ణ చేప‌ట్టారు.

 

 

Leave A Reply

Your email address will not be published.