రాష్ట్రం ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్రముఖ చిత్రకారుడు గోపి మరణం పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేట‌ర్‌గా, కార్టూనిస్ట్‌గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచార‌ని కొనియాడారు. పాలమూరుకు చెందిన గోపి మరణంతో తెలంగాణ ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా గోపి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్ర‌ముఖ చిత్ర‌కారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) క‌రోనాతో చికిత్స పొందుతూ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌లో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.