ఒఆర్ఆర్ ప‌రిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఒఆర్ ఆర్ పరిధిలోని మొత్తం 51 గ్రామాల‌ను స‌మీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.  రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజ‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ప‌లు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.

మున్సిపాలిటీలు, విలీనం కానున్న గ్రామాలు

  • పెద్ద అంబ‌ర్‌పేట మున్సిపాలిటీ – బాచారం, గౌరెల్లి , కుత్బుల్లాపూర్ తారామ‌తి పేట పంచాయ‌తీలు
  • నార్సింగి మున్సిపాలిటి – మీర్జా గూడ గ్రామ‌పంచాయ‌తి
  • మేడ్చ‌ల్ మున్సిపాలిటి – పూడూరు, రాయిలాపూర్ గ్రామ‌పంచాయ‌తి
  • శంషాబాద్ మున్సిపాలిటి – బ‌హ‌దూర్‌గూడ‌, పెద్ద గొల్కొండ‌, చిన్న గొల్కొండ‌, హ‌మీదుల్లాన‌గ‌ర్‌, ర‌షీద్ గూడ‌, ఘంసీమిగూడ‌
  • తుక్కుగూడ – హ‌ర్ష‌గూడ గ్రామ పంచాయ‌తి
  • ద‌మ్మాయి గూడ – కీస‌ర‌, యాద్గిరిప‌ల్లి, అంకిరెడ్డి ప‌ల్లి, చీర్యాల‌, న‌ర్స‌ప‌ల్లి, తిమ్మాయిప‌ల్లి
  • నాగారం – బోగారం, గోదాముకుంట‌, కరీంగూడ‌, రాంప‌ల్లి దాయార గ్రామ‌లు
  • ఘ‌ట్ కేస‌ర్ – అంకుషాపూర్‌, ఔషాపూర్‌, మాదారం, ఏదులాబాద్‌, ఘ‌నాపూర్‌, మ‌ర్ప‌ల్లిగూడ‌
  • పోచారం  – వెంట‌పూర్‌, ప్ర‌తాప‌సింగారం, కొర్రెముల‌, కాచివానిసింగారం, చౌద‌రిగూడ విలీనం కానున్నాయి.
Leave A Reply

Your email address will not be published.