Chennur: కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్

జైపూర్ (CLiC2NEWS): చెన్నూర్ నియోజకవర్గం, జైపూర్, భీమారంలో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం జైపూర్, భీమారం మండల తహశీల్ధార్ కార్యాలయాల్లో నిర్వహించిన ఈ చెక్కుల పంణీలో మొత్తం 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
మంగళవారం భీమారం తహశీల్దార్ కార్యాలయంలో చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ బాల్కసుమన్
