TS intermediate exams: జూన్​ నెలాఖరులో పరీక్షలు?

తెలంగాణ స‌ర్కార్ యోచ‌న‌!

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లో క‌రోనా కేసులు మొన్నటి వరకు విపరీతంగా పెరిగాయి.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్‌ నెలాఖరులో ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకుంటే మొద‌టి ఏడాది పరీక్షల ఫలితాల ఆధారంగా మార్కులు ఇచ్చే అంశాన్ని పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా చెప్పినట్లు సమాచారం.

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్లు ఏప్రిల్‌లో ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం జూన్ 1న స‌మీక్షించి నిర్ణ‌యం తీస‌కుంటామ‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలపై స్పష్టతకోసం ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.