AP PGCET 2021 నోటిఫికేషన్ విడుదల

అమరావతి (CLiC2NEWS): ఎపిలోని పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఆంధ్ర‌ప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. ఈ సంవ‌త్స‌రంల కడప యోగి వేమన వ‌ర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ్లి (బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.

  • ఫీజు వివ‌రాలు
    ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850,
    బీసీలకి రూ.750,
    ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది.
  • ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు
    ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30 చివ‌రి తేదీ
    రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ 4వ తేదీ వ‌ర‌కు
    రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు
  • ప‌రీక్ష‌
    అక్టోబర్ 22న పీజీ సెట్ పరీక్ష
Leave A Reply

Your email address will not be published.