ప్ర‌భుత్వంతో  విఆర్ఎల‌ చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రేప‌ట్నుంచి విధుల‌కు హాజ‌రు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో విఆర్ ఎలు జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయ‌ని.. వారు స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బిఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో విఆర్ ఎలు స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశంలో ప్ర‌మోష‌న్లు , ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరామ‌ని విఆర్ ఎల ప్ర‌తినిధి వంగ ర‌వీంద‌ర్ తెలిపారు. దానికి సిఎస్ సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించార‌ని అన్నారు. స‌మావేశంలో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయ‌ని, రేప‌ట్నుంచి విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని  తెలిపారు.

1 Comment
  1. Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.

Leave A Reply

Your email address will not be published.