టిడిపి, జ‌న‌సేన‌. బిజెపి పొత్తు.. ముగిసిన సీట్ల‌ స‌ర్దుబాటు

TDP 144 Assembly and 17 Lok Sabha seats

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీలు సీట్ల కేటాయింపుపై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం టిడిపి, బిజెపి, జన‌సేన ప్ర‌తినిధులు స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం సీట్లు కేటాయింపు కొలిక్కి వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ది. జ‌న‌సేన 2 లోక్‌స‌భ‌, 21 శాస‌స‌స‌భ స్థానాల్లో పోటీచేస్తుంది. బిజెపి 6 లోక్‌స‌భ‌, 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయ‌నుంది.

సోమ‌వారం ఎకావ‌త్‌, పండా, ప‌వ‌న్‌క‌ల్యాణ్.. చంద్ర‌బాబు నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు చ‌ర్చ‌లు కొనసాగిన అనంత‌రం షెకావ‌త్‌, పండా చంద్ర‌బాబు నివాసం నుండి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు.  టిడిపి ఇప్ప‌టికే 94, జ‌న‌సేన 5 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టిడిపి రెండో జాబితాను ఈనెల 14న ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. బిజెపి అర‌కు, అన‌కాప‌ల్లి, విజ‌జ‌య‌గ‌రం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి లోక్‌స‌భ స్థానాల్లో.. జ‌న‌సేన కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం ల‌లో పోటీ చేయ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.