AP: 8,987 కేసులు.. 35 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధఙలో కొత్తగా 8,987 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 35 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,472 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,15,626 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,889 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.