AP Corona: కొత్తగా 7796 కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎపిలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఎపిలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,68,112 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 77 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,629 మంది మృతి చెందారు.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 14,641 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16,48,895 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,588 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.