AP: ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

విశాఖపట్నం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ ఫలితాలను మంగళవారం విశాఖపట్నంలో కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎడ్సెట్ ఫలితాల్లో 13,428 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్ వెల్లడించారు. కాగా కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పేర్కొంది.