APPSC: ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అమరావతి (CLiC2NEWS): ఎపి సర్కార్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పలు తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. APPSC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో ఖాళీగా ఉన్న 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
ఖాళీలు:
- మొత్తం 151 ఖాళీలు
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) – 72
- మెడికల్ ఆఫీసర్ (యునానీ) – 26
- మెడికల్ ఆఫీసర్ (హోమియో) – 53 ఖాళీలు
అర్హతలు:
- అభ్యర్థులు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్నర్గా రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు:
- అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు:
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక:
- అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి. తర్వాత APPSC వెబ్సైట్లో ముందే రిజిస్టర్ అయి ఉంటే వివరాలతో లాగిన్ అయ్యి పోస్టులకు అప్లై చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉండకపోతే కొత్తగా రిజిస్టర్ అయి దరఖాస్తు చేసుకోవాలి.