భార‌త పౌరుల‌కు బ్రిట‌న్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

 బ్రిట‌న్ (CLiC2NEWS): 18-30 సంవ‌త్స‌రాల డిగ్రీ చ‌దివిన వారికి ప్ర‌తిఏటా 3000 వీసాలు అంద‌జేయ‌నున్న‌ట్లు యుకె ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇండోనేషియాలోని బాలి వేదిక‌గా జ‌రుగుతున్న‌ జి-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని న‌రేంద్రమోడీతో బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ భేటీ అయ్యారు. స‌మావేశం అయిన‌ కొద్ది గంట‌ల‌కే బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. 18-30 ఏళ్ల వ‌య‌స్సు వారికి డిగ్రీ విద్యార్హ‌త క‌లిగిన వారికి 3000 వీసాలు అంద‌జేసే విధాంగా యుకె- ఇండియా యువ నిపుణుల వీసా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. వీరు రెండేళ్ల వ‌ర‌కు చ‌దువుకొనేందుకు వీలుంటుంద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం నేడు ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.