Corona: హైకోర్టుకు ప్ర‌భుత్వం నివేదిక‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు ప్ర‌భుత్వం నివేదిక స‌మ‌ర్పించింది. రాష్ట్రంలో చేప‌డుతున్న కొవిడ్ ప‌రీక్ష వివ‌రాల‌ను, క‌రోనా క‌ట్ట‌డికి చేప‌డుతున్న చ‌ర్య‌లు, ఇత‌ర అంశాల‌ను ప్ర‌భుత్వం ఇందులో పేర్కొంది.

  • ఈ నెల 1 నుంచి 25వ తేదీ వ‌ర‌కు 23.55 ల‌క్ష‌ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ప్ర‌భుత్వం నివేదిక‌లో పేర్కొన్న‌ది. 4.39 ల‌క్ష‌ల ఆర్టీపీసీఆర్, 19.16 ల‌క్ష‌ల ర్యాపిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.
  • ఈ నెల 1 నుంచి 25వ తేదీ వ‌ర‌కు 341 మంది క‌రోనాతో మృతి చెందారు.
  • రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉంది.
  • క‌రోనా ప‌రీక్ష‌ల పెంపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపింది.
  • నిపుణుల క‌మిటీ స‌మావేశాలు ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్నాయి.
  • మ‌ద్యం దుకాణాలు, ప‌బ్‌లు నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.
  • మ‌ద్యం దుకాణాల‌ను అధికారులు త‌నిఖీ చేస్తున్నారు.
  • రాష్ర్టానికి 430 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను కేంద్రం కేటాయించింది.
  • వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్‌ను చేర‌వేస్తున్నాం.
  • రెమ్‌డెసివిర్ ప‌ర్య‌వేక్ష‌ణ నోడ‌ల్ అధికారిగా ప్రీతిమీనాను నియ‌మించాం అని ప్ర‌భుత్వం నివేదిక‌లో పేర్కొన్న‌ది.
Leave A Reply

Your email address will not be published.