న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మంచి నీటి పైప్‌లైన్‌ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల్సి రావ‌డంతో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. జలమండలి ఓ అండ్ ఎం నెం. 10బి, ప్రశాంత్ నగర్ పరిధిలోని ఆటో నగర్ రిజర్వాయర్ ఔట్ లెట్ మెయిన్ 1000 ఎంఎం డయా పైపులైనుకు ఆటో నగర్ నుంచి నాగోల్ వరకు నాలుగు ప్రాంతాల్లో అవుతున్న లీకేజీలను ఆరికట్టడానికి పైపులైనుకు అత్యవసరంగా మరమ్మత్తులు చేపట్టాల్సి వుంది. కావున, గురువారం ఉద‌యం 4 గంటల నుండి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు 24 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

ఉప్పల్ మెట్రో రైల్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, దేవేందర్ నగర్, రామంతపూర్ దేవేందర్ నగర్‌లో రెండు వాంబే హౌసింగ్ కాంప్లెక్స్‌లు, CDFD, శ్రీ సాయి RTC కాలనీ, ఆదర్శనగర్, వెంకట్ సాయి నగర్, శ్రీ కృష్ణ కాలనీ, ఓల్డ్ పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ ఫేస్ I & II, భవానీ నగర్ కాలనీలు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దఅంబర్‌పేట్, గౌరెల్లి మరియు కుత్బుల్లాపూర్, ఎన్టీఆర్ నగర్ బస్తీ, వాస్తు కాలనీ, RTC కాలనీ, శివ గంగా కాలనీ, శిరి రోడ్, శ్రీనివాస కాలనీ, శివమ్మ బస్తీ, నాగోల్ ప్రాంతాలు. కాబ‌ట్టి నీటిని పొదుపుగా వినియోగించుకోవాల‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.