AP: ఆ జిల్లాలు మినహా.. ఏపీలో రేపటి నుంచి సడలింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికోసం విధించిన ఆంక్షలను రేపటి నుంచి సడలించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలలింపు సమయాన్ని పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ 5 % కంటే తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో సడలింపుల సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచారు.
- పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.
- జులై 1 నుంచి 7 వరకు సడలించిన నిబంధనలు అమలలో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
- సడలించిన జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.