India Corona: కొత్త‌గా 18,870 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేల దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కు చేరింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,29,86,180 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 4,47,751 మంది బాధితులు మరణించారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • గ‌డిచిన 24 గంల‌ట వ్య‌వ‌ధిలో దేశంలో 28,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • గ‌డిచిన 24 గంల‌ట వ్య‌వ‌ధిలో దేశంలో 378 మంది మృతిచెందారు.
  • దేశవ్యాప్తంగా నిన్న ఒకేరోజు 54,13,332 మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు.
  • ఇప్పటివరకు 87,66,63,490 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.
Leave A Reply

Your email address will not be published.