India Corona: కొత్త‌గా 30,549 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 30,549 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,26,507కు పెరిగింది.
  • తాజాగా 38,887 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు.
  • కొత్త‌గా మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొవిడ్ బారినపడి మొత్తం 4,25,195 మంది మృత్యువాతపడ్డారు.
  • ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది.
  • దేశంలో మొత్తం 47,85,44,114 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
Leave A Reply

Your email address will not be published.