India Corona: కొత్తగా 38,948 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 43,903 మంది కోలుకోకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు. - తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
- ఇప్పటి వరకు దేశంలో 68,75,41,762 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.