తెలంగాణలో జనవరి 18 నుండి ‘కంటి వెలుగు’ కార్యక్రమం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వచ్చే జనవరి 18వ తేదీ నుండి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్ సిఎం కెసిఆర్ ప్రజారోగ్యంపై మంత్రులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు, కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్గౌడ్, సిఎస్ సోమేశ్ కుమార్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.