Mancherial: రాంనగర్, ఎన్టీఆర్నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే దివాకర్రావు

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాకేంద్రంలోని రాంనగర్, ఎన్టీఆర్ నగర్ లలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, తదితర స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలోని పలు ప్రాతంలో పర్యటించారు. ఈ పర్యటనలో స్థానికంగా నెలకొన్న సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు. డ్రైనేజీ సమస్యలు, రోడ్లు గుంతులు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట మంచిర్యాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్, మాజీ కౌన్సిలర్ అంకం మనోజ్, ఎన్టీఆర్ నగర్ టిఆర్ ఎస్ పార్టీ నాయకులు గంగులు, మల్లేష్, బిలాల్, సత్యం, ఆకుల శీను , టిఆర్ఎస్ యూత్ నాయకులు సంతోష్, ఇప్పప్రశాంత్, తుమ్మ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.