మిస్ వ‌రల్డ్ 2025 కిరీటం ద‌క్కించుకున్న థాయ్‌లాండ్ సుంద‌రి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): థాయ్‌లాండ్ సుంద‌రి మిస్ ఓప‌ల్ సుచాత‌ మిస్ వ‌రల్డ్ 2025 కిరీటం ద‌క్కించుకున్నారు. న‌గ‌రంలో గ‌త 20 రోజులుగా ప్ర‌పంచ సుంద‌రీ మ‌ణుల పోటీలు నిర్వ‌హిస్తున్నారు. నేడు హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌లో 72వ మిస్ వ‌రల్డ్ తుది పోటీలు నిర్వ‌హించారు. ఈ ఫైన‌ల్ పోటీల్లో థాయ్‌లాండ్ సుంద‌రికి మిస్ వ‌రల్డ్ కిరీటం వ‌రించింది.

ఓప‌ల్ సుచాత చువాంగ్‌కు మిస్ వ‌ర‌ల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని అలంక‌రించారు. సుచాత‌కు రూ.8.5 కోట్ల ప్రైజ్ మ‌నీ అంద‌నుంది. ఆమె థాయ్‌లాండ్‌లోని పుకెట్ లో జ‌న్మించారు.

ఈ పోటీల్లో మొత్తం 108 దేశాల‌కు చెందిన సుంద‌రీమ‌ణులు పాల్గొన్నారు. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పోటీల్లో స‌త్తా చాటి 16 మంది క్వార్ట‌ర్స్ కు ఎంపిక‌య్యారు. ఫైన‌ల్ పోటీల‌కు జ‌డ్జిలుగా .. జులియా మోర్లి, సోనూసూద్‌, సుధా రెడ్డి,, రానా ద‌గ్గు బాటి, జ‌యేష్ రంజ‌న్‌, మానుషి చిల్ల‌ర్‌, న‌మ్ర‌త శిరోద్క‌ర్ , డోనా వాళ్ష్ వ్య‌వ‌హ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.