చిన్నారి కుటుంబానికి పవన్కల్యాణ్ పరామర్శ

హైదరాబాద్ (CLiC2NEWS): సైదాబాద్లో ఆరేళ్ల బాలికపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. తానున్నానని ధైర్యం చెప్పారు. ఈ ఘటనలో నిందితునికి శిక్ష పడే వరకు పోరాడతానని పవన్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ.. చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసిందన్నరు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఓదార్పు అవసరం… దోషికి శిక్ష పడేవరకు జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్కల్యాణ్ వస్తున్నాడని తెలిసి.. పెద్దఎత్తున అభిమానులు సింగరేణి కాలనీకి చేరుకున్నారు. సింగరేణి కాలనీకి పవన్ చేరుకోగానే.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల రద్దీ వల్ల కారు దిగలేక పవన్ ఇబ్బంది పడ్డారు. అభిమానుల తోపులాటలో ఓ స్థానికుడి కారు కూడా ధ్వంసమైంది. కారు దగ్గరికే చిన్నారి తండ్రిని పిలిపించుకుని పవన్ వారిని ఓదార్చారు.