ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలి ఏడుగురి దుర్మరణం

కేదార్నాథ్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం చెందారు. కేదార్నాథ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 5.20 గంటలకు ఆరు గురు ప్రయాణికులతో కేదార్నాథ్ బయలుదేరిన హెలికాప్టర్ కు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కుప్పకూలింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ బయల్దేరిన పది నిముషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్డిఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ప్రమాద స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
కాగా ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.