జ‌ల‌దిగ్బంధంలో సిరిసిల్ల‌

సిరిసిల్ల‌ (CLiC2NEWS): తెలంగాణలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో జనాలు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో భారీ వ‌ర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షానికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఈ బారీ వ‌ర్ష‌ల‌కు ప‌ట్ట‌ణం దాదాపుగా వ‌ర‌ద నీటితో నిండిపోయింది. సిరిసిల్ల ప‌ట్ట‌ణంలోని పాత‌బ‌స్టాం డ్‌, వెంకంపేట‌, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, పెద్ద‌బ‌జార్ త‌దిత‌ర ప్రాంతాలు పూర్తిగా వ‌ర‌ద నీటిలో మునిగిపోయాయి. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. దాంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

సిరిసిల్ల‌లోని కొత్త చెరువు పూర్తిగా నిండి పోయింది. వ‌ర‌ద నీరు రోడ్డ‌పై పారుతోంది. అలాగే సిరిసిల్ల స‌మీపంలో ఉన్న బోనాల చెరువు ప్ర‌మాదకంగా మారింది. భారీగా చేరిన వ‌ర‌ద నీటితో ఏ క్ష‌ణంలోనైనా చెరువు క‌ట్ట తెగే ప్ర‌మాదం ఉంద‌ని స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కాగా జిల్లా క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వ‌ర్యంలో సిబ్బంది లోత‌ట్టు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

 

Leave A Reply

Your email address will not be published.