తల్లిదండ్రులు మాట్లాడుకోవడంలేదని కుమారుడు బలవన్మరణం

వేంపల్లె (CLiC2NEWS): ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటిలో పియుసి సెకండియర్ చదువుతున్న విద్యార్థి వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో టాపర్ ఉండే స్నేహితుడు విగతజీవిగా మారేసరికి తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తండ్రి కర్ణాటకలోని బళ్లారిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సుల మేనేజర్గా పనిచేస్తున్నాడు. కుమారిడి మృత దేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తల్లి దండ్రులు మాట్లాడుకోవడంలేదనే.. తీవ్ర మనస్థాపంతో విద్యార్థి లేఖ రాసి బలవన్మరణం పొందినట్లు తెలుస్తోంది. అమ్మా, నాన్నా మీరు ఇకనుండైనా కలిసి ఉండి మాట్లాడుకోండి, ఇదే నాచివరి కోరిక, నేను పుట్టడం మీకు దరదృష్టం.. కానీ నేను మీకు పుట్టడం నా అదృష్టం మళ్లీ జన్మంటూ ఉంటే మీ కొడుగానే పుడాతాను అంటూ.. లేఖలో పేర్కొన్నాడు.
Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.