విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్ట‌ర్‌

ప్ర‌మాదంలో ఒక‌రి మృతి.. 13 మందికి గాయాలు

చిత్తూరు (CLiC2NEWS): ఎపిలోని చిత్తూరు జిల్లాలో గోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని పులిచ‌ర్ల మండ‌లం గొట్టిగంటివారిప‌ల్లె కు దగ్గ‌ర కూలీల‌ను తీసుకు వెళ్లున్న ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి విద్యుస్ స్తంభాన్ని బ‌లంగా ఢీ కొన్న‌ది. దాంతో విద్యుత్ తీగ‌లు తెగి ప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన 13 మందిని తిరుప‌తి రుయా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు. కాగా ప్ర‌మాదానికి గురైన కూలీలంద‌రూ బీహార్‌, ఒడిశా రాష్ట్రాల‌కు చెందిన వారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.