TS: జూడాల ఆందోళన బాట.. రేపటి నుంచి నిరసన..!

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విదులు నిర్వహిస్తోన్న జూనియర్ డాక్టర్లు నిరసన బాటపడుతున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి ఈ నెల 26 వరకు నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ వైద్యులు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.. ఇక, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం అందించేలా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరో డిమాండ్ చేర్చారు. ఈ నెల 26వ తేదీ తర్వాత విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి కే ఆసుపత్రి సుపరింటెండెంట్లకు గాంధీ, కింగ్ కోఠి జూనియర్ వైద్యులు నోటీసులు ఇచ్చారు.