TS 10th Reesults: పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు bse.telangana.gov.in, bsetelangana.org వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించారు. వీరిలో 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.
ఈ సరి హాల్టికెట్లు జారీ చేయనందున.. విద్యార్థి పేరు, చదివిన పాఠశాలు పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు చేస్తే హాల్టికెట్ నంబర్తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
అలాగే విద్యార్థులు తమ మెమోలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని సూచించారు.