భారీ వ‌ర్షాల‌తో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల (CLiC2NEWS):  భారీ వ‌ర్షాల మూలంగా పంట నష్టపోయిన రైతులను ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన పంట పొలాలను చింతలపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా రైతులతో మాట్లాడటం జరిగింది. అనంతరం మంచిర్యాల జిల్లా వరదలపై శ్రీరామ్ పూర్ గెస్ట్ హౌస్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడుతున్న‌ ప్రభుత్వ విప్ బాల్క సుమన్

 

ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ.. వరద ప్రభావం, పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో ఇవాళ పరిశీలించామ‌ని తెలిపారు.. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే నష్ట పరిహారం విషయంపై సోమవారం (సెప్టెంబర్ 8) న ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందించాం.

చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో 5,545 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతీ హొళికేరీ, వెంకటేశ్వర్లు ( ఈఎన్ సీ కాళేశ్వరం ప్రాజెక్ట్), ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

అనంత‌రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాలను బాల్క‌సుమ‌న్ పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచి ర్యాల క‌లెక్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్. చిత్రంలో జిల్లా క‌లెక్ట‌ర్ త‌దిత‌రులు

త‌రువాత ప‌ట్ట‌ణంలో పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు, స్థానిక నాయ‌కులు హ‌రికృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ . చిత్రంలో స్థానిక ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు, స్థానిక నాయ‌కులు హ‌రికృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Leave A Reply

Your email address will not be published.