ఎపిలో కొత్తగా 261 కరోనా కేసుల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,269 కి చేరింది. దీనిలో 8,83,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,579 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఎపిలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,185 కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 125 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.
