ఎపిలో తగ్గిన కరోనా పరీక్షల ధరలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షలు తగ్గాయి. ఈ మేరకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గాయని జీవోలో పేర్కొంది. ఈ మేరకు కరోనా టెస్టింగ్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ. 800 నుంచి రూ. 475కు సర్కార్ తగ్గించింది. ఎన్ఏబీఎల్ ల్యాబ్లకు వెళ్లి చేయించుకునే కరోనా టెస్టింగ్ ధరలను రూ. 1000 నుంచి రూ. 499కు కుదించింది. మొత్తంగా ఎన్ఏబీఎల్ ల్యాబ్లకు వెళ్లి చేయించుకునే కోవిడ్ టెస్ట్ ధర సగానికి తగ్గించగా.. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరను దాదాపు సగం వరకు కుదించింది.