ఏపీలో కొత్తగా 199 కొవిడ్‌ కేసులు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ వైరస్‌ బారినపడిన వారిలో 423 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఏపీలో ఇప్పటివరకు 8,84,689 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,74,954 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,607 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,445 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,22,74,647శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.