ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 68,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్లు వైద్యారోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. తాగాజా మ‌రో 35 మంది మరణించారు. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87351కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 9,836 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 6,22,136 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో ప్రకాశంలో ఎనిమిది, చిత్తూరులో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు.. నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడి మొత్తం 35 మంది మరణించారు. దీంతో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 5780కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 59,435 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 57,34,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మ‌రోవైపు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో 991 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 907 కేసులు వ‌చ్చాయి.

 

Leave A Reply

Your email address will not be published.