కరోనా నుంచి కోలుకున్న స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా గత నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతికి అక్టోబర్ 28న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇక ఇటీవల జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు స్మృతి తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అందరికీ కృతఙ్ఞతలు అని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.