కారు బాంబు పేలి 20 మంది మృతి
మెఘాదీశు: సోమాలియా రాజధాని మెఘాదీశులో కారు బాంబు దాడిలో 20 మంది మృతి చెందారు. బాంబుతో కూడిన కారు ఓ రెస్టారెంట్లోకి దూసుకెళ్లి పేలింది. ఈ పేలుడులో రెస్టారెంట్, దాని చుట్టుపక్కల ప్రదేశమంతా ధ్వంసమయ్యాయి. ఈ భారీ పేలుడులో దాదా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.