కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

హైద‌రాబాద్‌: కేంద్ర మంత్రులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర నిధుల కోసం, కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కెటిఆర్ లేఖలు రాశారు. హైదరాబాద్ నగర సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులు కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. ఇక, వరంగల్ నగరంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని లేఖలో మంత్రి పేర్కొన్నారు. అలాగే పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.