చిత్తూరు, అరకు ఎంపిలకు కరోనా

న్యూఢిల్లీ: చిత్తూరు ఎంపి రెడ్డప్పకు, అరకు ఎంపి మాధవిలకు కరోనా పాజిటివ్గా తేలింది. వీరిద్దరూ ఈరోజు నుంచి ప్రారంభమౌతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గనేందుకు ఢిల్లీ వెళ్లారు. వీరికి పార్లమెంటరీ సెక్రటేరియట్ సిబ్బంది పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరికి ఢిల్లీలోనే రెండు వారాల పాటు చికిత్స అందించనున్నారు. వీరు కొలుకొని పరీక్షల్లో నెగిటివ్ వస్తే కానీ పార్లమెంటరీ సమావేశాలకు అనుమతించరు.
(కాకినాడ ఎంపీ వంగా గీతకు పాజిటివ్)
కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు.